![]() |
![]() |
.webp)
నిన్న అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకని చూడటానికి నేషనల్ లెవెల్ లోని మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. వీరితోపాటు దానికి హిందీ, తెలుగు, తమిళ్ ఇలా సినిమా ఇండస్ట్రీలోని సినీతారలంతా వెళ్ళారు. కాగా అక్కడికి వెళ్ల లేని కొందరు సెలెబ్రిటీలు ఇక్కడ గుడిలోకి వెళ్లి రాముడికి పూజలు చేసి, కాషాయ బెండాలని ఇళ్ళకి, బైక్ లకు కట్టుకొని తమ భక్తిని చాటుకున్నారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ కూడా తన భక్తిని చాటుకున్నాడు.
మొన్నటికి మొన్న రచయిత , యాక్టర్, దర్శకుడు తనికెళ్ళ భరణి గారిని కలిసిన పల్లవి ప్రశాంత్.. తాజాగా అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠని పురస్కారించుకొని తనకు రాముడిపై ఉన్న భక్తిని చాటుకున్నాడు. కాషాయ వస్త్రాలు ధరించి , తన వెనకాల కాషాయ జెండాలు ఉండి రాముడిని వేడుకుంటున్నట్టుగా ఉన్న ఈ ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా దీనికి విపరీతమైన వీక్షకాధరణ లభిస్తుంది. అత్యధిక సంఖ్యలో చూడటమే కాదు అత్యధికంగా కామెంట్లు వస్తున్నాయి. జై శ్రీరామ్.. సియా రామ్ అంటూ భక్తులు కామెంట్లలోనే రాముడిపై భక్తిని తెలియజేస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కామన్ మ్యాన్ క్యాటగిరీలో రైతుబిడ్డగా అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. రైతుబిడ్డ అంటే తగ్గేదేలా అన్నట్టుగా హౌస్ లో ఓ యుద్ధమే చేశాడు. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఉండగా అందరు సెలబ్రిటీలే వారందరిని వెనక్కి నెట్టి.. బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. ఇక విన్నర్ అయిన తరువాతి రోజే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కావడం.. ఆ తరువాత బెయిల్పై విడుదల కావడం.. ఇవన్నీ ప్రశాంత్ని వార్తల్లో హెడ్ లైన్స్ లో నిలిచేలా చేసాయి. ప్రస్తుతం ఇంటికెళ్ళి అమ్మనాన్నలతో కలసి సమయం గడుపుతున్నాడు. మొన్న ఓ టీవీ కార్యక్రమంలో సీరియల్ బ్యాచ్ వర్సెస్ స్పై బ్యాచ్ గా సాగింది. దాంట్లో శివాజీకి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ అని ఇచ్చాడు. ఆ తర్వాత 90's వెబ్ సిరీస్ సక్సెస్ మీట్ లో శివాజీ గురించి గొప్పగా చెప్పుకొచ్చాడు. ఇలా రెగ్యులర్ గా ఏదో ఒక ప్రోగ్రామ్ లో కన్పిస్తున్నాడు ప్రశాంత్.
![]() |
![]() |